తెలంగాణలో ఓట్ల విప్లవం రావలసిన సమయం ఆసన్నమైంది – గద్దర్

-

200 సంవత్సరాల నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, అనగారిన వర్గాలు కాపాడుకుంటున్న భూములను వారికి లేకుండా చేయడానికి సీఎం కేసీఆర్ దగా చేయడానికి ధరణి తీసుకొచ్చారని ఆరోపించారు ప్రజా యుద్ధనౌక గద్దర్. రాష్ట్రంలో కెసిఆర్ పాలన కట్టింది కూల కొట్టు, కమిషన్లు కొట్టు, ఎన్నికల్లో పంచి పెట్టు, గద్దెనెక్కు అన్న చందంగా నడుస్తుందన్నారు.

ప్రజాస్వామ్యంలో నాలుగవ స్తంభమైన పత్రికలు, మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు వారికి హక్కుగా ఉన్న ఇంటి స్థలాలు వెంటనే కేటాయించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ శ్రేణులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు ఈ ప్రభుత్వాలు ఆలంబిస్తున్న విధానాలను వివరించి చైతన్య పరిచి కెసిఆర్ ప్రభుత్వం గద్దె దింపే విధంగా ఓట్లు పోలరైజ్ చేసుకోవాలని సూచించారు. బిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రశ్నించే వాళ్లు లేకుండా పోతున్నారని.. ఇది ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news