ట్రాక్టర్‌ను ఢీకొట్టిన కంటైనర్.. ముగ్గురు కూలీలు దుర్మరణం

-

చెట్లు నాటే ఉపాధి హామీ కూలీలను కంటైనర్ ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతి చెందిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం మల్లెబోయినపల్లిలో చోటుచేసుకుంది. రోడ్డుపై మొక్కలు నాటుతున్న ఉపాధి హామీ కూలీల ట్రాక్టర్‌ను వెనక వైపు నుంచి వచ్చిన కంటైనర్‌ ఢీకొంది. ఈ ఘటనలో కూలీలు లలిత(26), యాదయ్య(48) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ విష్ణు(26)ను మహబూబ్‌నగర్‌ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు.

అటవీ శాఖ అధికారులు వీరితో డివైడర్‌పై మొక్కలు నాటిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతి చెందిన డ్రైవర్‌, కూలీలు జడ్చర్ల మండలం ఆలూరు గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. ప్రమాదానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని గ్రామస్థులు, మృతుల బంధువులు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news