గుండెపోటుతో పంజాబ్ ఎంపీ మృతి..రేవంత్ రెడ్డి నివాళులు

-

కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ సంతోక్ సింగ్ చౌదరి గుండెపోటుతో మరణించారు. పంజాబ్ ఫిలోర్ వద్ద యాత్రకు చేస్తుండగా… ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలాడు. దీంతో ఆయనను అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. కానీ మార్గమధ్యమంలోనే ఆయన మృతి చెందడం గమనార్హం.

అయితే, ఈ రోజు పంజాబ్ లో జరుగుతున్న భారత్ జోడో యాత్రలో గుండె పోటు తో అకస్మాత్తుగా మరణించిన జలందర్ ఎంపీ సంతోఖ్ సింగ్ చౌదరీ పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి. ఆయన కుమారుడు విక్రమ్ సింగ్ చౌదరీ తో వివరాలు అడిగి తెలుసుకుని, కుటుంబానికి తన సానుభూతిని తెలియ చేసారు టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news