65 సీట్లను రూ.600 కోట్లకు రేవంత్ అమ్ముకున్నారు : టీపీసీసీ కార్యదర్శి ఆరోపణ

-

గద్వాల టికెట్ ను పీసీసీ చీప్  రేవంత్ రెడ్డి రూ.10 కోట్లు, 5 ఎకరాల భూమికి అమ్ముకున్నారని టీపీసీసీ కార్యదర్శి విజయ్ కుమార్ ఆరోపించారు. ఈ మేరకు హైదరాబాద్ లోని గన్ పార్క్ వద్ద ఆయన ఆందోళన చేపట్టారు. నాడు ఓటుకు నోటు.. నేడు సీటుకు నోటు అంటూ తన అనుచరులతో కలిసి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి 65 సీట్లను రూ.600 కోట్లకు అమ్ముకున్నారు. తెలంగాణ ఉద్యమకారులకు టికెట్లు ఇవ్వకుండా వివక్ష చూపుతున్నారని పేర్కొన్నారు.

ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి కాకుండా పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికే టికెట్లు కేటాయించారు. ఆయన వల్ల పార్టీ తీవ్రంగా నష్టపోతుందన్నారు. వెంటనే రేవంత్ రెడ్డిని టీపీసీసీ అధ్యక్ష పదవీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రకటించిన తొలి జాబితాను ప్రక్షాళన చేయాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి అక్రమాలపై ఈడీ, ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news