కాంగ్రెస్ పార్టీకి భిక్ష పెట్టిందే టీఆర్ఎస్ : ఎమ్మెల్యే హరీశ్ రావు

-

2004 ఎన్నిక‌ల స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీకి జీవం పోసిందే టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఉట్టిగ‌నే త‌మ‌కు ప‌ద‌వులు ఇచ్చింద‌ని రేవంత్ రెడ్డి మాట్లాడ‌టం స‌రికాద‌ని హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు. శాస‌న‌స‌భ‌లో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానంపై చ‌ర్చ సంద‌ర్భంగా ఎమ్మెల్యే కాకుండానే హ‌రీశ్‌రావును మంత్రిని చేసిన ఘ‌న‌త కాంగ్రెస్ పార్టీది అని రేవంత్ చేసిన వ్యాఖ్య‌ల‌కు హ‌రీశ్‌రావు వివ‌ర‌ణ ఇచ్చారు.

శాస‌న‌స‌భ్యుడు కాకుండా త‌న‌ను మంత్రిని చేసిన ఘ‌న‌త కాంగ్రెస్ పార్టీది అని సీఎం మాట్లాడారు. ఆ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన ఘ‌న‌త టీఆర్ఎస్ పార్టీది. చంద్ర‌బాబు హ‌యాంలో క‌నీసం ప్ర‌తిప‌క్ష హోదా కూడా ద‌క్క‌ని కాంగ్రెస్ పార్టీకి జీవం పోసింది కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీతో హిమాచ‌ల్ భ‌వ‌న్‌లో చ‌ర్చ‌లు జ‌రిగిన‌ప్పుడు వెంక‌ట‌స్వామి, మాజీ ఎంపీ సురేంద‌ర్ రెడ్డి, కేసీఆర్, ఆలే న‌రేంద్ర నేను ఆ చ‌ర్చ‌ల్లో ఉన్నాను. పొత్తుల చ‌ర్చ‌లు జ‌రిగిన‌ప్పుడు త‌ప్ప‌కుండా ఈ రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తామ‌ని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తే నా ఇంట్లో కూర్చొని తెలంగాణ రాష్ట్రం తీసుకొని పో అని ప్ర‌ణ‌బ్ అన్నారు.

మేం పొత్తు పెట్టుకోవ‌డం వ‌ల్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చింది. మీరు ఏదో గెలిస్తే మాకు ప‌ద‌వులు ఇవ్వ‌లేదు. మేం కాంగ్రెస్ పార్టీకి భిక్ష పెట్టినం. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావ‌డానికి స‌హ‌క‌రించాం అని హ‌రీశ్‌రావు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news