బీజేపీకి షాక్.. బీఆర్ఎస్‌లో చేరిన తుల ఉమ..!

-

బీజేపీ పార్టీకి మరో షాక్‌ తగిలింది. వేములవాడ టికెట్ ఆశించి భంగపడిన బీజేపీ నేత తుల ఉమ ఆ పార్టీ సభ్యత్వానికి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పదవికి రాజీనామా చేశారు. రాజీ నామా పత్రాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పంపించారు . అనంతరం ఆమె తిరిగి సొంతగూటికి చేరు కున్నారు. మంత్రి కేటీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రి ఆమెకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా,వేములవాడ అసెంబ్లీ స్థానం నుంచి తుల ఉమ బీజేపీ టికెట్ ఆశించారు.

చివరి లిస్టులో తుల ఉమ పేరు ప్రకటించిన బీజేపీ అధిష్ఠానం తర్వాత మార్పులు చేసింది. చివ‌రి నిమిషంలో తుల ఉమ అభ్యర్థిత్వాన్ని క్యాన్సిల్ చేసి..వికాస్‌రావుకు టికెట్ ఇచ్చింది. దీంతో తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరిగా రాజీమానా చేస్తుండటంతో ఏం చేయాలో తెలియక ఆ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news