శంషాబాద్​లో విషాదం.. వాగులో ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతు

-

రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. శంషాబాద్ శివారులోని నానాజీ వాగులో సోమవారం రోజున ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టగా.. ఇవాళ ఉదయం ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి.

జూకల్​ ప్రాంతానికి చెందిన మహేందర్, నదీమ్ అనే ఇద్దరు యువకులు సోమవారం ఉదయం 10 గంటల సమయంలో నానాజీ వాగులో ఈతకు దిగారు. ప్రవాహం ఎక్కువగా ఉండడం, ఈత రాకపోవడంతో యువకులు నీట మునిగి గల్లంతయ్యారు. సమాచారం అందడంతో గజ ఈతగాళ్లతో పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు.

గాలింపులో భాగంగా రెండు మృతదేహాలు లభ్యం కాగా.. వాటిని బయటకు తీశారు. ఘటనా స్థలంలో మొబైల్ ఫోన్లు, బట్టలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యువకుల మృతితో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news