TRS పార్టీకి విజయశాంతి శుభాకాంక్షలు

-

 

మునుగోడు ఉప ఎన్నికల్లో అందరూ అనుకున్నదే జరిగింది. అధికార టిఆర్ఎస్ పార్టీ మునుగోడు ఉప ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టింది. బిజెపి అభ్యర్థి అయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫై టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గ్రాండ్ విక్టరీ కొట్టాడు. మునుగోడు ఉప ఎన్నికల్లో 10,307 ఓట్ల తేడాతో కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. ఈ నేపథ్యంలోనే TRS పార్టీకి విజయశాంతి శుభాకాంక్షలు చెప్పారు.

మునుగోడులో గెలిచిన అభ్యర్థిని అభినందిస్తున్నానని ట్వీట్‌ చేశారు విజయశాంతి. మిగిలిన ఒక సంవత్సర కాల అవకాశం లోనైనా… ఈ ఎన్నికలల్ల ఇచ్చిన కొన్ని వాగ్దానాలనైనా ప్రజలకై నిలబెట్టుకోవాలని ఆశిస్తున్నాను.అయితే తెలంగాణలో ఎన్నికలు ఇకపై ప్రజాస్వామ్య పద్ధతిలో సామాన్యులు కూడా పాల్గొనే పరిస్థితి నుంచి అధికార టీఆర్ఎస్ తనకున్న ధనబలంతో… అధికార దుష్ప్రయోగంతో దూరం చేస్తున్నదేమో అనిపిస్తున్నదని చురకలు అంటించారు విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Latest news