భజరంగ్‌దళ్‌ పై నిషేధం..విజయశాంతి సంచలన ట్వీట్‌

-

భజరంగ్‌దళ్‌ను నిషేధిస్తామని కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రస్తావించడం ఎంత వరకూ సమంజసమో ఆ పార్టీ విశ్లేషించుకోవడం అత్యంత ఆవశ్యకం అని విజయశాంతి సంచలన ట్వీట్‌ చేశారు. హిందువులు విశ్వసించే భావాలకు, నమ్మకాలకు వ్యతిరేక నిర్ణయాలను ప్రకటిస్తున్న కాంగ్రెస్‌ని మెజారిటీ ప్రజలు అనుమానించవలసిన పరిస్థితిని ఆ పార్టీ స్వయంగా సృష్టించుకుంటున్నది కావచ్చన్నారు.

కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ ప్రకటనను యుపిఎ భాగస్వాములుగా ఉందామనుకుంటున్న ఎన్ని రాజకీయ పార్టీలు సమర్ధిస్తాయో వారే తెలియజేయాలి. భజరంగ్‌దళ్‌పై నిషేధం, ఆరెస్సెస్‌పై రాహుల్ గారి తీవ్ర విమర్శలు… ఇవన్నీ ఎంఐఎం వంటి పార్టీల అనుకూలత కోసమే అనేది కూడా ప్రజలు తప్పక అలోచన చేస్తారు. నిజానికి ప్రజలలో విభజన సృష్టించడమే బీజేపీ విధానమైతే… ఈ రోజు దేశమంతా ఆత్యధికంగా ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధుల రూపంలో పరిపాలనా బాధ్యతలలో ఉండదు. వాస్తవాలు చెబుతున్నది అంతే అనిపిస్తున్నదని వివరించారు విజయశాంతి.

 

Read more RELATED
Recommended to you

Latest news