బండి సంజయ్ మార్పు బాధాకరమే – విజయశాంతి

-

తెలంగాణ బీజేపీ చీఫ్‌ పదవి నుంచి బండి సంజయ్ ని మార్చడం బాధాకరమే అన్నారు బిజేపి నేత విజయశాంతి. తెలుగు రాష్ట్రాల పార్టీ చీఫ్‌లను బీజేపీ అధిష్టానం..మార్చేసిన సంగతి తెలిసిందే. ఏపీ బీజేపీ చీఫ్‌గా దగ్గుబాటి పురంధేశ్వరిని నియమించిన బీజేపీ అధిష్టానం.. తెలంగాణ బీజేపీ చీఫ్‌గా జీ కిషన్ రెడ్డిను నియమించింది.

అయితే.. ఈ సందర్భంగా.. విజయశాంతి మాట్లాడుతూ, నిప్పులు పుట్టించే నడకలు పార్టీకి నేర్పిన బండి సంజయ్ మార్పు బాధాకరమే అన్నారు రాములమ్మ. అయినా, పార్టీ మరింత మంచి బాధ్యతను సంజయ్‌కి అప్పగిస్తుందని భావిస్తూ, దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే కార్యకర్తల మనోభావాలు అగ్ర నాయకత్వం గుర్తించగలదని విశ్వసిస్తున్నా అని తెలిపారు విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Latest news