బండి సంజయ్‌ అధ్యక్ష పదవి మార్పుపై విజయశాంతి సంచలన పోస్ట్‌

-

బండి సంజయ్‌ అధ్యక్ష పదవి మార్పుపై విజయశాంతి సంచలన పోస్ట్‌ చేశారు. బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవి మార్పు పై మీడియా లీకేజీలు సరి కాదని వెల్లడించారు విజయశాంతి. బీజేపీలో వార్తలు లీక్ చేసే పద్ధతి ఉండదు. సార్వత్రిక ఎన్నికలు పూర్తి అయ్యే వరకూ బండి సంజయ్ గారు కొనసాగుతారని తరుణ్ చుగ్ గారు గతంలో చెప్పిన అంశం మాత్రమే ఇప్పటికీ అధికార పూర్వకం అన్నారు విజయశాంతి.

నేతల భేటీలపై ఊహాగానాలతో వెలువడే మీడియా కథనాలు, సమాచారం ఎప్పటికీ అధికార ప్రకటనలు కానే కావని వివరించారు. వీటి ప్రభావం పార్టీపైనా, ప్రజల్లోనూ ఉండదని చెప్పారు విజయశాంతి. పార్టీ అధికార ప్రతినిధుల నుంచి మాత్రమే కచ్చితమైన సమాచారం లేదా ప్రకటన వస్తుంది. ఎవరికైనా అదే అధికారికం అవుతుంది తప్ప ఊహాజనిత వార్తలు కాదని చెప్పుకొచ్చారు విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Latest news