జగన్ పాలన మొత్తం అవినీతి, కుంభకోణాలే – అమిత్‌ షా

-

జగన్ పాలన మొత్తం అవినీతి, కుంభకోణాలే అంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న విశాఖలో నిర్వహించిన బహిరంగ సభలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ప్రసంగించారు. రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్ర ప్రదేశ్ 3వ స్థానంలో ఉన్నందుకు వైఎస్ జగన్ సిగ్గుపడాలంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు అమిత్ షా.

నాలుగేళ్ల జగన్ పాలనలో అవినీతి, కుంభకోణాలు తప్ప ఏమీ చేయలేదంటూ వ్యాఖ్యలు చేశారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా . పేదల కోసం మోడీ రేషన్ ఉచితంగా బియ్యం పంపిస్తుంటే జగన్ బియ్యం మీద స్టిక్కర్ వేసుకుంటున్నాడని ఆగ్రహించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి దాదాపు 5 లక్షల కోట్ల వరకు మోడీ ఇచ్చినా అభివృద్ధి జరగలేదని మండిపడ్డారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా. ఈ సొమ్ము అంతా ఎక్కడికి పోయింది అంటే జగన్ ప్రభుత్వంలో క్యాడర్ అవినీతి జరుగుతుందన్నారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా.

Read more RELATED
Recommended to you

Latest news