బ్రేకింగ్: కరోనా భయంతో మహిళ ఆత్మహత్య…!

-

కరోనా భయం జనాలను ఒకరకంగా వేధించడం లేదు. ఎప్పుడు ఏమవుతుందో అనే భయంతో చాలా మంది ఆత్మహత్యలు చేసుకునే ఘటనలు ఈ మధ్య మనం తరుచుగా చూస్తున్నాం. తాజాగా ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది హైదరాబాద్ లో. హైదరబాద్ లోని షాపూర్ నగర్ లో నివాసం ఉండే ఎలుగు పల్లి అనంతరెడ్డి, సుజాత సుమిత్రా ట్రేడర్స్ కిరాణ ని నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో సుజాత నాలుగు రోజుల క్రితం జ్వరం బారిన పడ్డారు. దీనితో వెంటనే ఆమెకు పరిక్షలు చేయించగా మలేరియా అన్నారు వైద్యులు. కాని తాను మాత్రం ఎక్కడ కరోనా వచ్చిందో అనే కంగారులో ఆత్మహత్య చేసుకుంది. భర్త నైట్ డ్యూటీ కి వెళ్ళారు. కుమారుడు వేరే గదిలో ఉండగా ఆమె హాల్ లో నిద్రపోతున్నారు. ఉదయం కుమారుడు లేచి చూసే సరికి ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ నెల 10న చోటు చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news