సైకో సీఎం వికృత పాలనకు ఇదొక ఉదాహరణ – నారా లోకేష్

-

వైసీపీ పాలన పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. జగన్ విధ్వంసక పాలనకు సజీవసాక్షి జైన్ ఇరిగేషన్ అని అన్నారు. విధ్వంసక పాలకుడు జగన్ వినాశక చర్యలకు ప్రత్యక్షసాక్షి నందికొట్కూరు నియోజకవర్గం తంగెడంచలో నిలచిపోయిన జైన్ ఇరిగేషన్ ప్రాజెక్టు అని.. రైతులకు అధునాతన వ్యవసాయ పరికరాలు అందించడంతోపాటు కరువు సీమలో యువతకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో చంద్రబాబు గారి ఆహ్వానం మేరకు అప్పట్లో స్వర్గీయ భవర్ లాల్ జైన్ తంగెడంచలో ప్రాజెక్టు ఏర్పాటుకు ముందుకు వచ్చారని తెలిపారు.

గత ప్రభుత్వంలో ఇందుకోసం 623ఎకరాల భూమి కూడా కేటాయించారని.. అనుకున్న ప్రకారం ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్ర రైతాంగం జీవన స్థితిగతులు మారిపోయేవన్నారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ సహకారం లేకపోవడంతో జైన్ ప్రాజెక్టు నిలచిపోయిందని ఆరోపించారు. సైకో సిఎం వికృత పాలనకు ఇదొక ఉదాహరణ మాత్రమేనని అన్నారు నారా లోకేష్.

Read more RELATED
Recommended to you

Latest news