సీఎం కేసీఆర్ పై CBI కి ఫిర్యాదు చేయనున్న వైఎస్ షర్మిల

-

సీఎం కేసీఆర్ ని టార్గెట్ చేశారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల. సీఎం కేసీఆర్ కాలేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడ్డారని.. వేల కోట్లు సంపాదించారని ఆమె పాదయాత్రలో ఇన్నాళ్లు విమర్శిస్తూ వచ్చారు. ఇప్పుడు కేసీఆర్ ఆస్తులపై నేరుగా సిబిఐ, కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసేందుకు రెడీ అయ్యారు.

ఈ నేపథ్యంలో వైయస్ షర్మిల ఈనెల 6న ఢిల్లీకి వెళ్ళనున్నారు. 7న కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సమావేశం అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయంపై ఇప్పటికే గవర్నర్ తమిళిసైకి సైతం ఫిర్యాదు చేశారు షర్మిల. ఇక ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి మరోసారి ఫిర్యాదు చేసే అవకాశం ఉందని అంటున్నారు. సీఎం కేసీఆర్ కుటుంబ ఆస్తులతో పాటు, కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పై సిబిఐ విచారణ జరపాలని కోరనున్నట్లు ప్రచారం జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news