Bigg Boss 5: ఇద్దరికి కరోనా పాజిటివ్‌

-

సెప్టెంబర్ 5వ తారీఖున ప్రారంభం కాబోయే బిగ్ బాస్ షో కు కరోనా సెగ తాకింది. బిగ్ బాస్ 5 కంటెస్టెంట్స్ లో ఇద్దరికీ కరోనా పాజిటివ్ గా తేలినట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం వారిని క్వారంటైన్ లో ఉంచినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఇద్దరూ కంటెస్టెంట్ ఎవరనే దానిపై ఇంకా క్లారిటి రాలేదు. మొత్తానికి వారిద్దరికీ కరోనా సోకినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇక ఈ బిగ్బాస్ ఐదవ సీజన్ కు అక్కినేని నాగార్జున హోస్టు గా బాధ్యతలు చేపడుతున్న సంగతి తెలిసిందే.

మరోవైపు షో ప్రారంభ తేది దగ్గర పడుతుండటంతో కంటెస్టెంట్ ఎవరు అన్నదానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే కొంత మంది పేర్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. వారిలో యాంకర్ రవి, లోబో, కార్తీకదీపం ఫేమ్ ఉమాదేవి, నటి లహరి, యాంకర్ ప్రత్యూష, హనీ మాస్టర్, సిరి హనుమంతు, ట్రాన్స్ జెండర్ ప్రియాంక, నటి ప్రియా, నవ్య స్వామి, 7 హార్ట్ సరయు సుమన్, ఫోక్ సింగర్ కోమలి ఇలా చాలా పేర్లు వినిపిస్తున్నాయి. అయితే వీరు ఎవరు అన్నదానిపై సెప్టెంబర్ 5వ తేదీనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news