అమరావతి రైతుల పాదయాత్రలో ఉద్రిక్తత

-

అమరావతి రైతుల పాదయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు బ్రిడ్జి వద్దకు పాదయాత్ర చేరుకోగానే వికేంద్రీకరణకు మద్దతుగా ఏర్పాటు అయిన జేఏసీ నేతలు అక్కడికి చేరుకున్నారు. మూడు రాజధానులు ముద్దు.. ఫేక్ యాత్రికులు గో బ్యాక్ అంటూ జేఏసీ నేతలు స్లొగన్స్ ఇచ్చారు. అలాగే వైసిపి నేతలు నల్ల బెలూన్లతో నిరసన తెలిపారు. దీంతో ఇరు వర్గాలు పోటా పోటీగా నిరసనకు దిగడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

రైతుల పాదయాత్ర పైకి దూసుకు వచ్చేందుకు ప్రయత్నించారు జేఏసీ, వైసీపీ నేతలు. దీంతో భారీగా మోహరించిన పోలీసులు.. వారిని చెదరగొట్టారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. రైతు మద్దతుదారులు, జయసి నాయకులు పోటాపోటీగా నినాదాలు చేస్తున్నారు. ఇక అమరావతి రైతుల పాదయాత్రకు నిడదవోలు ప్రజలు భారీగా మద్దతు తెలుపుతున్నారు. వర్షం పడుతున్నా కానీ రైతులు పాదయాత్రను ఆపకుండా ముందుకు వెళుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news