మంత్రి సత్యవతి రాథోడ్ సంచలన నిర్ణయం !

-

మంత్రి సత్యవతి రాథోడ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో మళ్లీ టిఆర్ఎస్ అధికారంలోకి రావాలని కోరుకుంటూ సత్యవతి రాథోడ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చి మూడవసారి కెసిఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వరకు చెప్పులు లేకుండానే తిరుగుతానని ప్రతిజ్ఞ చేశారు. గిరిజనులకు 10% రిజర్వేషన్లు ప్రకటించిన స్టేజి మీదనే తాను చెప్పులు ధరించడం వదిలేసినట్లు పేర్కొన్నారు.

గిరిజనులందరి పక్షాన మరోసారి కేసీఆర్ సీఎం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో సైతం చెప్పులు లేకుండానే ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఇంటింటికి విస్తృత ప్రచారం చేస్తున్నారు. మారుమూల గ్రామాలలో రాళ్లలో, ముళ్లలో సైతం లెక్కచేయకుండా చెప్పులు లేకుండానే ప్రచారంలో పాల్గొనడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. సీఎం కేసీఆర్ కోసం మంత్రి ఏకంగా చెప్పులు వేసుకోకుండా ఉండడం చాలా గొప్ప విషయం అంటూ పార్టీ నేతలు పేర్కొంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news