ఆన్‌లైన్‌ గేమ్స్‌ చిచ్చు : హైదరాబాద్‌ లో టెన్త్‌ విద్యార్ధి ఆత్మహత్య..

-

హైదరాబాద్‌ లో విషాదం చోటు చేసుకుంది. మొబైల్‌ ఫోన్‌ లో ఆడొద్దన్నందుకు ఓ విద్యార్థి సుసైడ్‌ చేసుకుంది. ఈ ఘటన సోమ వారం ఉదయం చోటు చేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే…. హైదరాబాద్‌ మీర్‌ పేట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి లోని సర్వోదయ నగర్‌ కు చెందిన 17 సంవత్సరాల ఓ బాలిక తరచు మొబైల్‌ పోన్‌ లో గేమ్స్‌ ఆడుతూ ఉండేది.

అర్ధరాత్రి అయినా… మొబైల్‌ పోన్‌ లో గేమ్స్‌ ఆడుతూ ఉండేది. అయితే… నిన్న రాత్రి… ఆ బాలిక తండ్రి… మొబైల్ ఫోన్ లో గేమ్స్ ఆడకుడదని ఆ బాలికను మందలించాడు. దీంతో ఆ బాలిక తీవ్ర మనస్థాపానికి గురైంది. అందరూ పడుకున్న తర్వాత.. ఇంట్లో ఉన్న సీలింగ్‌ ఫ్యాన్ కు ఉరేసుకుని సుసైడ్‌ చేసుకుంది ఆ బాలిక. దీంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలోకి వెళ్లింది. ఇక ఈ ఘటన తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు. అటు పోస్టుమార్టం నిమిత్తము ఉస్మానియకు ఆ బాలిక మృతదేహాన్ని తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news