తెలంగాణను రద్దు చేసి.. సమైక్యాంధ్రకు కేసిఆర్ రెడీ : టిజి వెంకటేష్ సంచలనం

-

కర్నూలు : టిజి వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిఎం కేసిఆర్ కు కరోనా కారణంగా బ్రెయిన్ ఎఫెక్ట్ అయిందని..నీటి పంపకాల ఒప్పందాలు కెసిఆర్ మర్చిపోతున్నారని ఫైర్ అయ్యారు. కొత్తగా వచ్చిన తెలంగాణ రాష్ట్రం రద్దు చేసి సమైఖ్యాఆంధ్ర అంటే కేసిఆర్ ఒప్పుకుంటారని.. ఆయన పెద్ద మేధావి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. హైద్రాబాద్ లో ఎన్నికలు వస్తే ఆంధ్ర పాట పాడ్తారని… కరీంనగర్ లో ఎన్నికలు వస్తే తెలంగాణ పాట పాడతారని చురకలు అంటించారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయించిన నీటి పంపకాలు కేసిఆర్ కాదంటున్నారని…తెలంగాణ నేతలు శ్రీశైలం ప్రాజెక్టు విద్యుత్ ప్రాజెక్టు మాత్రమే అంటున్నారని మండిపడ్డారు.

శ్రీశైలం ప్రాజెక్టు విద్యుత్ ప్రాజెక్టు అయితే సాగునీరుగా, తాగునీటినీరుగా ఎలా వాడుకున్నారని చురకలు అంటించారు. కొత్త ఒప్పందాలు రద్దయితే పాత ఒప్పందాలు పాటించాలి…నిజాం వచ్చి తన ఒప్పందం రద్దు అంటే కేసిఆర్ ఒప్పుకుంటారా? అని నిలదీశారు. నిజాం పాలనపై పోలీస్ యాక్షన్ ఎలా ఉండేదో.. శ్రీశైలం డ్యామ్ పై పోలీస్ యాక్షన్ తీసుకొని డ్యామ్ స్వాధీనం చేసుకోవాలని పేర్కొన్నారు. జల వివాదం సివిల్ వార్ కు దారి తీస్తుందని.. కేసీఆఆర్ కు రాయలసీమ, ఆంధ్ర నాయకులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఏపీ ఓట్లు తెలంగాణలో ఉన్నాయి తప్ప.. తెలంగాణ ఓట్లు ఏపీలో లేవని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news