శరవేగంగా నిర్మితమవుతున్న ఆ హార్బర్

-

తూర్పుగోదావరి జిల్లాలోని యు. కొత్తపల్లి మండలం అమీనాబాద్ లో నూతనంగా హార్బర్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 275 కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ ప్రాజెక్టును హైదరాబాద్ కు చెందిన ప్రముఖనిర్మాణ సంస్థ ఎం.ఆర్ .కే .ఆర్ ప్రైవేట్ లిమిటెడ్ చేపట్టింది.

హార్బర్ నిర్మాణం కోసం ప్రభుత్వం 52 ఎకరాలు ఎకరాలు కేటాయించగా ప్రస్తుతం 28 ఎకరాల్లో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. సుమారు 600 మీటర్ల పొడవున జెట్టి నిర్మాణం కావాల్సి ఉండగా ప్రస్తుతం జెట్టి ఫైలింగ్, రాక్ ఫిల్లింగ్, బ్రేక్ వాటర్ వంటి పలు పనులు కొనసాగుతున్నాయి.
ఈ ప్రాజెక్టును 2023 మార్చి నాటికి హార్బర్ నిర్మాణం పూర్తి అవుతుంది అని ప్రాజెక్టును పర్యవేక్షణ చేస్తున్న  కాకినాడ పోర్టు అధికారులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news