ఈ దశాబ్దానికి అతిపెద్ద జోక్ కెసిఆర్ జాతీయ పార్టీ పెట్టడం – కిషన్ రెడ్డి

-

వచ్చే ఎన్నికల్లో కెసిఆర్ కి ఒక్క ఎంపి సీటు కూడా రాదని… బిజెపి స్వీప్ చేస్తుందని అన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. మీ అవినీతి కుటుంబ పార్టీ లు ఏకం అయినా.. మోడీ నీ ఏమి చేయలేవన్నారు. కేంద్ర ప్రభుత్వం మోటర్ల కు మీటర్లు పెట్టదని స్పష్టం చేశారు. కెసిఆర్ ఎక్కువ రోజు లు ఉంటే విద్యుత్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు.

 

తెలంగాణ రైతు లారా, విద్యుత్తు ఉద్యోగులారా కెసిఆర్ ను నమ్మకండని అన్నారు. కెసిఆర్ కుటుంబం అవినీతి తో ఎంత దోచుకున్నారో కక్కించే ప్రయత్నం బిజెపి చేస్తుందన్నారు. మజ్లిస్ కి బిజెపి భయపడదని.. మజ్లిస్ పార్టీ మోచేతి నీళ్ళు తాగుతుంది కెసిఆర్ అని అన్నారు. మజ్లిస్ పార్టీ చేతిలో రాష్ట్రాన్ని పెట్టిన పార్టీ పాలన దేశానికి కావాలా? అని ప్రశ్నించారు. ఈ దశాబ్దానికి అతి పెద్ద జోక్ కెసిఆర్ జాతీయ పార్టీ పెట్టడమేనన్నారు. నిజాం ని మించిన నిజాం కెసిఆర్ అంటూ మండిపడ్డారు. బిజెపి యేతర పార్టీ లకు డబ్బులు ఎలా పంపిణీ చేస్తున్నావు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news