రాష్ట్రపతికి లేఖ రాసిన పుల్లారెడ్డి స్వీట్స్ యాజమాని కోడలు

-

పుల్లారెడ్డి స్వీట్స్ యాజమాని కోడలు ప్రజ్ఞా రెడ్డి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి లేఖ రాసింది. పుల్లారెడ్డి స్వీట్స్ యాజమాని రాఘవరెడ్డి, ఆయన భార్య భారతి రెడ్డి, వారి కుమార్తె విద్యారెడ్డి ల నుంచి తనని కాపాడాలని ఈ లేఖ రాసింది. వీరు గత రెండేళ్లుగా తనని, తన కుమార్తెను తీవ్రంగా వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించింది ప్రజ్ఞ రెడ్డి. అంతేకాక తనని చంపేందుకు ప్రయత్నించారని లేఖలో పేర్కొంది.

తన అత్త భారతి రెడ్డి పై హైదరాబాదులో భూకబ్జా కేసులు కూడా ఉన్నాయని లేఖలో వివరించింది. ఓ మహిళగా సాటి మహిళ వేదనను అర్థం చేసుకుంటారు అన్న ఆలోచనలతో మీకు ఈ లేక రాస్తున్నానని.. దయచేసి న్యాయం చేయాలని వేడుకుంది ప్రజ్ఞా రెడ్డి. గతంలో తనని ఇంట్లో బంధించి గోడ కట్టారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news