ఫోన్ మాట్లాడుతున్న కుమార్తెను మేడ పైనుంచి తోసేసిన తండ్రి

-

పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం ఉన్నవ గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. దాబాపై ఫోన్లో మాట్లాడుతున్న కూతురిని అనుమానంతో కిందికి తోసేసాడు ఓ కసాయి తండ్రి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉన్నవ గ్రామానికి చెందిన కూరాకుల కావ్య గణపవరం సిఆర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. ఈనెల 8న ఇంటి డాబాపై సెల్ ఫోనులో మాట్లాడుతున్న సమయంలో అనుమానంతో కిందకు తోచేసిన తండ్రి కూరాకుల వరప్రసాద్.

డాబా పైనుంచి కింద పడటంతో కుమార్తెకు తీవ్ర గాయాలు అయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండడంతో జిజిహెచ్ కు తరలించారు. ప్రస్తుతం కోమాలో ఉండి చికిత్స పొందుతుంది కావ్య. భర్త వరప్రసాద్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన పాప తల్లి శోభారాణి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు యడ్లపాడు పోలీసులు.

 

Read more RELATED
Recommended to you

Latest news