పర్లేదు.. డబ్బులు తీసుకుని ఓటు వేయండి.. ప్రచారంలో బీజేపీ నేత ఆసక్తికర వ్యాఖ్యలు..!

-

ప్రస్తుతం గ్రేటర్ ఎన్నికలను అన్ని పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి అన్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే పార్టీలోని కీలక నేతలు అందరూ రంగంలోకి దిగి ప్రచారం నిర్వహిస్తున్నారు ముఖ్యంగా బీజేపీకి మద్దతు ప్రకటించడానికి ఏపీ బీజేపీ నేతలు కూడా కదిలి వస్తున్నారు అంతేకాకుండా.. అంతేకాకుండా అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా బీజేపీకి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీ బీజేపీ నేత మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ఇటీవలే జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారంలో పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు.

భవిష్యత్తులో హైదరాబాద్ దేశానికి రెండవ రాజధానిగా మారే అవకాశం ఉంది అంటూ వ్యాఖ్యానించారు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి. అయితే గ్రేటర్ ను మరింత గ్రేట్ గా మార్చగల సత్తా కేవలం బిజెపికి మాత్రమే ఉంది అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ప్రజలందరూ బిజెపికి ఓటు వేసి మేయర్ పీఠాన్ని కట్టబెట్టాలి అంటూ పిలుపునిచ్చారు. అయితే జిహెచ్ఎంసి ఎన్నికల్లో టిఆర్ఎస్ నాయకులు ఇచ్చే డబ్బులు తీసుకొని బిజెపికి ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ఆదినారాయణరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news