సల్మాన్ ఖాన్ కు భద్రత పెంచిన మహారాష్ట్ర సర్కార్

-

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు మహారాష్ట్ర ప్రభుత్వం భద్రతను రెట్టింపు చేసింది. సల్మాన్ ఖాన్, ఆయన తండ్రి సలీమ్ ఖాన్ లను చంపుతామంటూ ఆదివారం బెదిరింపు లేఖలు వచ్చిన సంగతి తెలిసిందే.. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర హోంశాఖ ఆయనకు భద్రతను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పంజాబ్ సింగర్ సిద్దుకి పట్టిన గతే సల్మాన్ ఖాన్ కి కూడా పడుతుందని దుండగులు బెదిరింపు లేఖలో హెచ్చరించారు.

దీంతో అప్రమత్తమైన సల్మాన్.. బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దుండగులు లేఖ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సల్మాన్ ను కలిశారు. కాగా పంజాబీ సింగర్ సిద్దు మూసేవాలా హత్య నేపథ్యంలో ఈ బెదిరింపు లేఖలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గతంలో కూడా సల్మాన్ ను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Latest news