నార్సింగిలో దోపిడీ దొంగల బీభత్సం

-

నార్సింగీలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. రక్త మైసమ్మ దేవాలయం సమీపంలో దారి దోపిడికి తెగబడ్డారు. మోటర్ సైకిల్ పై వేళుతున్న ఇద్దరి పై దాడి చేసింది దోపిడీ ముఠా. కిషోర్ కుమార్ రెడ్డి, తులసి అనే ఇద్దరు వ్యక్తుల‌ పై దాడి చేశారు. తల్వార్ లతో విచక్షణారహితంగా దాడి చేసింది దోపిడీ ముఠా. దాడిలో తీవ్ర కత్తి పోట్లకు గురై స్పాట్ లో మృతి చెందాడు కిషోర్ కుమార్ రెడ్డి.

తులసి దోపిడీ దొంగల నుండి తప్పించుకున్ంది. దీంతో తులసి వెంట పడ్డారు దొంగలు. తల్వార్ తో దాడి చేయడం తో ఓ చేయి నాలుగు వ్రేళ్లు కోల్పోయింది తులసి. అనంతరం తులసి వద్ద ఉన్న 15 వేల రూపాయలు లాగేసుకున్నారు ముఠా సభ్యులు. వారి నుండి చాకచక్యంగా తప్పించుకొని నార్సింగీ పోలీస్ స్టేషన్ కు చేరింది తులసి. దీంతో తులసిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news