BREAKING : ఎస్సారెస్పీ కెనాల్లో కొట్టుకుపోయిన పూజారి ఆచూకీ లభ్యం

-

జగిత్యాల జిల్లా ఎస్సారెస్పీ కెనాల్లో కొట్టుకుపోయిన పూజారి ఆచూకీ లభ్యం అయింది. జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లి ఎస్సారెస్పీ కెనాల్ లో బింగి ప్రసాద్ అనే అర్చకుడు దసరా రోజు దుర్గా దేవిని నిమజ్జనం చేస్తుండగా గల్లంతయ్యాడు. ఇత్తడి అమ్మ వారి విగ్రహాన్ని కడిగేందుకు ఎస్ ఆర్ ఎస్ పి కెనాల్ లోకి దిగిన అర్చకుడు కడిగేందుకు యత్నిస్తుండగా కాలుజారి నీటిలో పడిపోయాడు.

నీటిలో కొట్టుకుపోతుండగా అక్కడే ఉన్న స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. నీటి ప్రవాహం తగ్గడంతో చొప్పదండి మండలం రేవల్లే సమీపంలో శుక్రవారం మృతదేహం పైకి తేలియాడుతు కనిపించింది.

స్థానికులు పోలీసులకు సమాచారం అందించి అతన్ని బయటకు తీశారు.అయితే అర్చకుడు కడగడానికి ప్రయత్నం చేసిన అమ్మవారి ఇత్తడి విగ్రహం అర్చకు డి చేతిలోనే ఉండటంతో ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రాణాలను విడిచాడు కానీ అమ్మవారి విగ్రహాన్ని మాత్రం చేతిలో నుండి విడవని ఆర్చకుని భక్తి కి గ్రామస్థులు విస్తు పోయారు. అర్చకుని మరణ వార్త విని గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news