“ఊపర్ షేర్వానీ.. అందర్ పరేషాని” అన్నట్లుంది రాష్ట్ర పరిస్థితి – వైఎస్ షర్మిల

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి.. బంగారు తెలంగాణ చేశానని చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. ధనిక రాష్ట్రం అని చెబుతూనే పేదలను జలగల్లాగా పట్టిపీడిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు షర్మిల.

“పైన పటారం.. లోన లోటారం”.. “ఊపర్ షేర్వానీ.. అందర్ పరేషానీ” అన్నట్లుంది రాష్ట్ర పరిస్థితి. దొర చేసిన అప్పులకు రాష్ట్ర ఆదాయం కిస్తీలకే మిగలట్లే. రాష్ట్రం సిద్ధించిన నాటికి సంపద 16వేల కోట్లు. ఇప్పుడు అప్పు 4.50లక్షల కోట్లు. దొర చేసిన అప్పులకు 8న్నర ఏండ్లుగా కట్టిన వడ్డీ లక్ష కోట్లు. ఇంత అప్పు చేసినా జనానికి ఒరిగింది మాత్రం సున్నా. ఆరోగ్యశ్రీకి డబ్బుల్లేవ్. ఫీజు రీయింబర్స్ మెంట్ కు పైసల్ లేవ్. ఏ పథకానికి నిధుల్లేవ్. ఆఖరికి ఉద్యోగుల జీతాలకు కూడా అతీగతీ లేదు.

తిన్నది కల్వకుంట్ల కుటుంబం.. కట్టేది జనం. మీ పార్టీ అకౌంట్ లో 860కోట్లకు వడ్డీలు మీరు తినాలే..! రాష్ట్ర అప్పులకు వడ్డీలు జనాలు కట్టాల్నా? ధనిక రాష్ట్రం అంటూనే జనాలను జలగల్లా పీల్చుకుతింటుండు దొర. చక్ర వడ్డీలతో చక్రం తిప్పి, ఒక్కో నెత్తిన లక్షన్నర అప్పు పెట్టి, రాష్ట్రాన్ని అప్పులకుప్ప చేసి.. బంగారు తెలంగాణ చేశానని, ఇక బంగారు భారత్ చేస్తానంటూ దేశాన్ని దోచుకోడానికి పోతుండు” అంటూ సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news