జల వివాదంపై ట్విస్ట్‌ ఇచ్చిన సుప్రీం కోర్టు

-

కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ వైఖరిపై సుప్రీంకోర్టు లో పిటిషన్ దాఖలు చేసింది ఏపి సర్కార్. అయితే.. ఇవాళ సుప్రీం కోర్టు సిజే రమణ నేతృత్వంలోని బెంచ్ ముందు ఏపీ సర్కార్‌ వేసిన పిటీషన్‌ పై విచారణ జరిగింది. మధ్యవర్తిత్వంకు తాము సిద్ధంగా లేమని సుప్రీం కోర్టుకు తెలిపింది ఏపి సర్కార్. దీంతో ఈ పిటిషన్‌ పై సుప్రీం కోర్టు సీజే రమణ కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఈ మరో బెంచ్ కు ఏపీ సర్కార్‌ వేసిన పిటిషన్ ను బదిలీ చేసారు సుప్రీం కోర్టు సిజే రమణ. న్యాయ ప్రక్రియ ద్వారానే కేసు పరిష్కరించాలని సుప్రీంకోర్టును కోరారు ఏపి సర్కార్ న్యాయవాది. అటు సీజేఐ ధర్మాసనమే విచారణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం కూడా కోరింది. దీంతో కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తిని తోసిపుచ్చింది సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ. దీంతో కృష్ణా నదీ జలాల వివాదంపై ఏపీ పిటీషన్‌ ను మరో ధర్మాసనానికి బదిలీ చేసారు సుప్రీం సీజేఐ ఎన్వీ రమణ.

Read more RELATED
Recommended to you

Latest news