నామినేషన్‌ దాఖలు చేసిన మాజీ ఎమ్మెల్యే భార్య..తోడుగా వెళ్లిన మంత్రి, ఎంపీ.

-

దుబ్బాక ఉప ఎన్నికకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సోలిపేట సుజాత రోజు నామినేషన్‌ దాఖలు చేశారు..తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌తో కలిసి ఆమె ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు సమర్పించారు..దుబ్బాక సిట్టింగ్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగా రెడ్డి అనారోగ్యంలో మృతి చెందటంతో ఈసీ దుబ్బాక నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహిస్తుంది..దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధించి గత నెల కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసింది..నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభమైంది, ఈ నెల 16వ తేదీ వరకు నామిషన్ల స్వీకరణకు గడువు ఉండగా.. 17న పరిశీలన, 19వ తేదీ వరకూ ఉపసంహరణకు అవకాశం ఉంది.. నవంబరు 3న పోలింగ్‌, 10న కౌంటింగ్‌ నిర్వహించనున్నారు. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థులను ఖరారు చేశాయి. బీజేపీ అభ్యర్థిగా రఘునందన్‌రావు, కాంగ్రెస్‌ అభ్యర్థిగా చెరుకు శ్రీనివాసరెడ్డి బరిలో పోటీలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news