సుశాంత్ రాజ్‌పుత్‌లో కేసులో కీలక మలుపు..నిర్మాత దినేష్ విజన్ నివాసంలో ఈడీ సోదాలు.

-

నటుడు సుశాంత్ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసుపై దర్యాప్తులో ఈడీ దూకుడు పెంచింది..ఇప్పటికే సీబీఐ,నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో కేసులు నమోదు చేసి విచారణ చేపట్టాయి..అయితే సుశాంత్‌ ఆత్మహత్య కేసు అనుకోని మలుపులు తిరుగుతోంది..విచారణలో నివ్వెరపోయే నిజాలు బయట పడుతున్నాయి..మొదట అతని ప్రియురాలు రియా మీదుగా ప్రారంభమైన విచారణ అనేక మలుపులు తిరిగి ఎక్కడెక్కడికో వెళ్తోంది..సుశాంత్‌ మారక ద్రవ్యాలకు బానిసై ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఎన్సీబీ విచారణ చేపట్టి పలువురు సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చింది..ఇప్పటికే తాప్సీ, దీపిక పదుకొణె ఎన్సీబీ ముందు తమ వాగ్ములం ఇచ్చారు..మరోవైపు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసులో ప్రస్తుతం ఆర్థిక కోణాల్లో ఈడీ దర్యాప్తు కొనసాగిస్తుంది..తాజాగా సినీ నిర్మాత దినేష్ విజన్ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహిస్తుంది..సుశాంత్ మృతిలో ఆర్థికపరమైన అంశం ప్రధానంగా ఉండటంతో ఈడీ దర్యాప్తు వేగం పెంచింది.

Read more RELATED
Recommended to you

Latest news