తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తో భేటీ అయిన తీన్మార్ మల్లన్న

-

తెలంగాణలో మళ్లీ పట్టు సాధించేందుకు టిడిపి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. గతేడాది నవంబర్ లో తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ ను చంద్రబాబు నియమించిన విషయం తెలిసిందే. అంతకుముందు టిడిపి అధ్యక్షుడిగా ఉన్న బక్కని నరసింహులుని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించి.. కాసాని జ్ఞానేశ్వర్ కి తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవిని కట్టబెట్టారు.

అయితే తెలంగాణలో టిడిపిని మళ్ళీ బలోపేతం చేసేందుకు ఇటీవల చంద్రబాబు తెలంగాణ పర్యటన చేసిన విషయం కూడా తెలిసిందే. అయితే తాజాగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తో భేటీ అయ్యారు తీన్మార్ మల్లన్న. ఈ భేటీ వెనుక అసలు కారణాలు ఏంటో తెలియాలి. ప్రస్తుతం ఈ భేటీ రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news