హైదరాబాద్ లో ఆ ఏరియాలో తిరగాలంటే గుండెల్లో రైళ్ళు…!

-

హైదరాబాద్ లో దొంగల విషయంలో పోలీసులు ఎంత సీరియస్ గా ఉన్నా సరే ఎక్కడో ఒక చోట దొంగతనాలు కంగారు పెడుతున్నాయి. తాజాగా దొంగతనాలు హైదరాబాద్ లో ఒక ప్రాంతంలో ఆందోళన కలిగిస్తున్నాయి. రాచకొండ కమిషనరేట్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస చైన్ స్నాచింగ్ లు జరుగుతున్నాయి. రోడ్డుపై తిరగాలంటే మహిళలు భయపడే పరిస్థితి ఏర్పడింది.

ఈ మధ్య కాలంలో వరుసగా 8 చైన్ స్నాచింగ్ లు జరిగాయి. ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా పోలీసులు చేధించలేదు. రోడ్డు పైకి రావాలంటే జవహర్ నగర్ వాసులు భయపడుతున్నారు. తాజాగా చంద్రపురి కాలనీ బాలాజీ నగర్ లో అంజమ్మ అనే వృద్ధురాలు మెడలో నుండి మూడున్నర తులాల పుస్తెలతాడు అపహరణకు గురైంది. హోండా బైక్ పై వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న ఏ సి పి శివ కుమార్… సీసీ టీవీ ఫూటేజ్ పరిశీలించారు.

Read more RELATED
Recommended to you

Latest news