పవన్ కళ్యాణ్ పై మంత్రి బొత్స సెటైర్లు

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. చంద్రబాబు ఐడియాలజీలను పవన్ వెల్లడిస్తుంటాడని..అంతకు మించి పవన్ ఏం చేస్తాడు? అని ఏద్దేవా చేశారు. లోకేష్ పాదయాత్ర వలన ప్రజలకు ఏం ఉపయోగం ఉంటుంది? అని ప్రశ్నించారు బొత్స. జగన్ తెచ్చిన ప్రతి పథకమూ పేదలందరికీ ఉపయోగపడేలా చేశాడని అన్నారు. చంద్రబాబు మోసం, కుట్ర, దగా తప్ప మరేం చేశారు? అని దుయ్యబట్టారు.

లోకేష్ కూడా అలాంటి వ్యక్తేనని అన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అందరినీ మోసం చేశాడని ఆరోపించారు. వైసీపి స్లీపర్ సెల్స్ తొక్కిసలాట వలనే జనం చనిపోయారని చంద్రబాబు అనటం సిగ్గుచేటని మండిపడ్డారు మంత్రి బొత్స. అంతకంటే చంద్రబాబు దిగజారుడుతనం ఉంటుందా? అన్నారు. చంద్రబాబు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news