మీ కుటుంబానికి ఎవరి పాలనలో మంచి జరిగిందో ఆలోచించండి : సీఎం జగన్

-

“మీకు, మీ కుటుంబానికి ఎవరి పాలనలో మంచి జరిగిందో మీరే ఆలోచించండి”  అని సీఎం జగన్ పేర్కొన్నారు.  ఈ ఎన్నికల్లో మీ కుటుంబ భవిష్యత్ ఆధారపడి ఉంది. ఈ ఎన్నికలు మోసాల బాబుకు చివరి ఎన్నికలు కావాలి. ప్రతి గ్రామంలోనూ అభివృద్ధి, సంక్షేమం చేసి చూపించాం. ప్రతి నెలా ఒకటో తేదీనే పెన్షన్ ఇస్తున్నాం. లంచాలు, వివక్ష లేకుండా పాలన అందిస్తున్నాం. నాడు-నేడుతో ప్రభుత్వ స్కూళ్ల రుపురేఖలు మార్చాం. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియాన్ని అందుబాటులోకి తెచ్చామని సీఎం జగన్ వివరించారు.

బాబు కూటమిని ఓడించేందుకు మీరంతా సిద్ధమేనా? ఇంటికి వెళ్లి మీ ఇల్లాలితో ఆలోచన చేయండి, మీ పిల్లలతో చేయండి, మీ ఇంట్లో ఉన్న అవ్వా తాతలతో ఆలోచన చేయండి.ఎవరి పాలనలో మంచి జరిగింది అనే దానిపై ఆలోచన చేయండి.ఈ ఎన్నికలతో మీ కుటుంబాల భవిష్యత్ అనేది నిర్ణయం అవుతుందనేది గుర్తుపెట్టుకోండి. ఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర అయితే, మోసాల బాబు పార్టీకి ఈ ఎన్నికలు చివరి ఎన్నికలు కావాలని ఇక్కడనుంచే పిలుపునిస్తున్నానని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news