ఈ ప్రభుత్వం శంకుస్థాపన చేసి గొప్పలు చెప్పుకోవడం తప్ప పనులు చేయడం లేదు – జానారెడ్డి

-

నాగార్జునసాగర్ ఎడమ కాలువ సుమారుగా 60 సంవత్సరాలు కావడంతో కాలువ భద్రతలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు మాజీ సిఎల్పీ నేత జానారెడ్డి. పెద్దవూర మినీ గురుకుల పాఠశాలకు కనీస వసతులు లేని బిల్డింగ్ లో ఏర్పాటు చేయడం సిగ్గుచేటుగా ఉందన్నారు. మినీ గురుకుల పాఠశాల విద్యార్థులను సురక్షితంగా కాపాడిన పోలీసు అధికారులకు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రభుత్వం శంకుస్థాపన చేసి గొప్పలు చెప్పుకోవడం తప్ప పనులు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాలువ గండిపడి నష్టపోయిన రైతులకు తక్షణమే పంట నష్ట సహాయంగా 15000 నుండి 20,000 ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. నిడమనూరు, నర్సింగగూడెం గ్రామంలో ఇళ్లల్లో నీరు చేరిన బాధితులను ప్రభుత్వం తక్షణమే సహాయం చేయాలన్నారు. ఇళ్లల్లో నీరు చేరి ఇబ్బంది పడుతున్న ప్రతి కుటుంబానికి.. వాళ్ళు ఇళ్లల్లో వెళ్లే వరకు బియ్యం పంపిణీ చేస్తామని, వారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news