చిత్తూరులో భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు సజీవదహనం

-

చిత్తూరులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రంగాచారి వీధిలో ఉన్న పేపర్ ప్లేట్ల తయారీ పరిశ్రమలో ఈ ఘటన జరిగింది. అర్ధరాత్రి సమయంలో పరిశ్రమలో మంటలు చెలరేగి.. ముగ్గురు వ్యక్తులు సజీవదహనమయ్యారు. మృతుల్లో పరిశ్రమ యజమాని భాస్కర్‌, ఆయన కుమారుడు ఢిల్లీ బాబు, బాలాజీ అనే మరో వ్యక్తి ఉన్నట్లు గుర్తించారు.

ప్రమాద సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు అగ్నిమాపక యంత్రాల సాయంతో మంటలు ఆర్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా ఈ అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చునని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతులు పూర్తిగా కాలిపోవడం వల్ల ఎవరి మృతదేహం ఎవరిదో చెప్పడం కష్టంగా మారిందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news