వడాపావ్ పరిచయం చేసిన మాధురీ దీక్షిత్

-

నేడు ముంబైలో దేశంలోనే తొలి యాపిల్ స్టోర్ ప్రారంభించనున్నారు. ఈ స్టోర్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా స్వయంగా యాపిల్ సీఈఓ టిమ్ కుక్ హాజరవుతారు. ప్రస్తుతం ముంబైలో ఉన్న టిమ్‌ కుక్‌కు మాధురీ దీక్షిత్ సోమవారం వడా పావ్‌ రుచిని పరిచయం చేశారు. ముంబైలోని ఓ రెస్టారెంట్‌లో టిమ్‌కుక్‌తో కలిసి తను వడా పావ్ తింటున్న ఫొటోను మాధురి ట్విట్టర్‌లో షేర్ చేశారు. వడా పావ్‌తో అతిథికి ఆహ్వానం పలకడంకంటే మెరుగైనది ఇంకోటి ఉండదు అంటూ ట్వీట్ చేశారు.

Tim cook tastes vada pav for the first time and this is what he has to say

బిర్యానీకి హైదరాబాద్ ఎంతో ప్రసిద్ధి చెందిందో వడా పావ్‌కు ముంబై అంత ఫేమస్ అన్న విషయం తెలిసిందే. ఇక మాధురి ట్వీట్‌కు టిమ్ కుక్ కూడా తన దైన శైలిలో రిప్లై ఇచ్చారు. వడా పావ్ రుచిని పరిచయం చేసిన మాధురికి నా ధన్యవాదాలు. ఈ వంటకం రుచి చూడటం ఇదే తొలిసారి. అద్భుతంగా ఉంది అంటూ రిప్లై ఇచ్చారు. దీంతో.. ఈ ట్వీట్ల థ్రెడ్ వైరల్‌గా మారింది. కుక్‌కు ముంబై లోకల్ ట్రైన్లను కూడా పరిచయం చేయాలని మరికొందరు సూచించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news