నేడు జంగారెడ్డిగూడెంకు చంద్రబాబు

-

అమరావతి : కాసేపటి క్రితమే.. జంగారెడ్డి గూడెం పర్యటనకు బయలుదేరారు టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. జంగారెడ్డి గూడెంలో వరుస మరణాలపై టీడీపీ ఆందోళన వ్యక్తం చేస్తుంది. కల్తీసారా వల్లే వరుస మరణాలంటూ టీడీపీ పార్టీ ఆరోపణలు చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ జంగారెడ్డి గూడెంలో మృతుల కుటుంబాలను పరామర్శించనున్నారు చంద్రబాబు నాయుడు. సహజ మరణాలను కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నాడంటూ అటు వైసీపీ పార్టీ మండిపడుతోంది.

అనారోగ్యంతో చనిపోయినా కల్తీ సారా అంటూ డ్రామాలాడుతున్నారని నిప్పులు చెరిగారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. ఇక అటు జంగారెడ్జి గూడెంలో వరుస మరణాలపై అసెంబ్లీ వద్ద టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసన చేపట్టింది. కల్తీ సారాతో వరుస మరణాలు జరుగుతున్నాయని టీడీపీ సభ్యుల నినాదాలు చేస్తున్నారు. మద్యం బాటిళ్లతో అసెంబ్లీ సమీపంలోని అగ్నిమాపక కేంద్రం నుంచి ర్యాలీ చేపడుతూ సభకు హాజరయ్యారు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. దీంతోసభను వాయిదా వేశారు స్పీకర్‌.

Read more RELATED
Recommended to you

Latest news