పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన యాంకర్​ లాస్య

-

టాలీవుడ్ యాంకర్ లాస్య మరో గుడ్‌న్యూస్ చెప్పింది. రెండోసారి తల్లైన లాస్య.. మళ్లీ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది. ‘మా జీవితంలో కొత్త ప్రేమను కలుసుకున్నాం’ అంటూ ఓ క్యూట్​ వీడియో పోస్ట్​ చేసింది లాస్య. మార్చి 7న చిన్నారి జన్మించినట్లు తెలిపింది.  ఆ వీడియోలో లాస్య, మంజునాథ్​తో పాటు వారి తొలి సంతానమైన దక్ష్​ చేతులు ఉన్నాయి. ఒక్కొక్కరు తమ చేతులు ఓపెన్​ చేస్తూ వస్తుంటే ‘ఇట్స్​ ఏ బేబీ బాయ్​’ అనే పదం కనిపిస్తోంది. ఈ విధంగా తమ సంతోషకరమైన వార్తను అభిమానులతో పంచుకున్నారు లాస్య దంపతులు.

తన యాంకరింగ్​ ద్వారా ప్రేక్షకులకు సుపరిచితురాలైన లాస్య.. బిగ్​బాస్​తో మరింత ఫేమస్​ అయ్యింది. మంజునాథ్​ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లాడింది. వీరికి ఇదివరకే దక్ష్​ అనే కుమారుడు ఉన్నాడు. ఫ్యాన్స్​ కోసం సోషల్​ మీడియాలో యాక్టివ్​గా ఉండే ఈ తార.. యూట్యూబ్​లో వీడియోలు కూడా చేస్తుంటుంది. ఈ బ్యూటీ యూట్యూచ్ ఛానెల్‌కు చాలా క్రేజ్ ఉంది. లాస్య చేసే యూట్యూబ్ వీడియోలంటే చాలా మంది ఇష్టపడుతుంటారు. అందుకే ఆ వీడియోలకు లైకులు, షేర్లు కూడా ఆ రేంజ్‌లోనే ఉంటాయి మరి.

Read more RELATED
Recommended to you

Latest news