రేపు సీఎం జగన్‌ బర్త్‌ డే..రూ. 2.50 కోట్లు ఖర్చు చేస్తున్న సర్కార్‌ ?

-

ఈ నెల 21న అంటే రేపు సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించాలని వైసీపీ నిర్ణయించింది. దీనిలో భాగంగా ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటనుండగా, రేపు రెండు తెలుగు రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో రెడ్ క్రాస్ సంస్థతో కలిసి రక్తదాన శిబిరాలను నిర్వహించనుంది.

cm jagan
cm jagan

అటు వైసీపీ అభిమానులు, నేతలు జగన్ వీడియోలను పోస్ట్ చేస్తూ ముందస్తుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే, సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలకు మాత్రం రూ. 2.50 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారు. ఒకవైపు నాటక పరిషత్తులు, కళాకారులకు రూ.4 కోట్ల బకాయిలు చాన్నాళ్లుగా ఇవ్వడం లేదు. వారు కాళ్ళు అరిగేలా తిరుగుతున్నారు. మరోవైపు జన్మదిన వేడుకల కోసం మాత్రం భారీగా ఖర్చుపెట్టి సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news