శభాష్ : స్మశానంలో ఉన్న వ్యక్తిని.. భుజాలపై మోసిన లేడీ ఎస్ఐ.. వీడియో వైరల్

-

తమిళనాడు రాష్ట్రంలో గత వారం రోజులుగా విపరీతంగా వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ గురువని వర్షపాతం తమిళనాడు రాష్ట్రంలో నమోదవుతోంది. ముఖ్యంగా చెన్నై పట్టణంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో అధికారులు, పోలీసులు… నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు చేస్తున్నారు.

అయితే ఈ నేపథ్యంలోనే.. తమిళనాడు రాష్ట్రంలోని ఓ లేడీ ఇన్స్ స్పెక్టర్ చేసిన పనికి.. అందరూ ఫిదా అయిపోతున్నారు. పోలీస్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరి… ఓ గుర్తు తెలియని వ్యక్తి ని ఆస్పత్రికి తరలించింది. అనారోగ్యంతో స్మశానవాటికలో అపస్మారక స్థితిలో ఉన్న ఆ వ్యక్తి తన భుజాలపై వేసుకొని మరి ఆసుపత్రికి తీసుకు వెళ్ళింది ఎస్ఐ రాజేశ్వరి.

ఘటనా స్థలంలో చాలా మంది పోలీసులు ఉన్నప్పటికీ ఎంతో ధైర్యంగా అతన్ని తన భుజాలపై వేసుకొని తీసుకువెళ్ళింది రాజేశ్వరి. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంకేముంది ఆ ఇన్స్పెక్టర్ రాజేశ్వరి పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి అధికారులు అన్నిచోట్ల ఉండాలని కామెంట్లు పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news