ఇవాళ, రేపు విజయవాడ నగరంలో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు

-

విజయవాడ: వైసీపీ ప్లీనరీ నేపథ్యంలో ఇవాళ, రేపు విజయవాడ నగరంలో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు విజయవాడ నగరంలో ఆంక్షలు కొనసాగనున్నాయి. గుంటూరు నుంచి విశాఖపట్నం వెళ్లే వాహనాలు తెనాలి, కొల్లూరు, పెనుమూడి వారధి, అవనిగడ్డ, పామర్రు, హనుమాన్‌ జంక్షన్‌ మీదుగా మళ్లించారు విజయవాడ పోలీసులు.

అలాగే.. చెన్నై నుంచి విశాఖపట్నం వెళ్లే వాహనాలు ప్రకాశం జిల్లా త్రోవగుంట నుంచి చీరాల, బాపట్ల, రేపల్లె, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, హనుమాన్‌ జంక్షన్‌ మీదుగా మళ్ళింమళ్లించారు విజయవాడ పోలీసులు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌ వెళ్లే వాహనాలు హనుమాన్‌జంక్షన్‌ నుంచి ఇబ్రహీంపట్నం వైపు, హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్లే వాహనాలు ఇబ్రహీంపట్నం వద్ద నుండి హనుమాన్‌ జంక్షన్‌ వైపు మళ్ళించారు.

Read more RELATED
Recommended to you

Latest news