సనత్ నగర్ ఇండోర్ స్టేడియంలో దారుణం.. స్విమ్మింగ్ ఫూల్ లో పడి బాలుడు మృతి

-

ఈ మధ్య కాలంలో నిత్యం దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా వేసవి కాలం వచ్చిందంటే చాలు.. పిల్లలు స్విమ్మింగ్ పూల్ కి వెళ్లి లేదంటే.. నదుల్లో, చెరువుల్లో ఈతకు వెళ్లి తమ నిండు ప్రాణాలను బలి కొంటున్నారు. ఇలాంటి సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు అధికారులు చెప్పినప్పటికీ జాగ్రత్తలు తీసుకోకుండా ప్రాణాలను కోల్పోతున్నారు.

తాజాగా హైదరాబాద్ నగరంలోని సనత్ నగర్ ఇండోర్ స్టేడియంలో దారుణం చోటు చేసుకుంది. GHMC స్విమ్మింగ్ పూల్‌లో పడి బాలుడు మృతి చెందాడు. స్థానిక ప్రైవేట్ స్కూల్‌లో 6th క్లాస్ చదువుతున్న కార్తికేయ.. ఫ్రెండ్స్‌తో కలిసి క్రికెట్ ఆడుతుండగా.. స్విమ్మింగ్ పూల్‌లో  బాల్ పడింది. ఆదివారం స్విమ్మింగ్ పూల్ బంద్ ఉండటంతో గోడ దూకి వెళ్లి బాల్ తీస్తుండగా ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్‌లో మునిగి చనిపోయాడు కార్తికేయ. మృత దేహాన్ని బయటికి తీసి పోస్టుమార్టంకు తరలించారు పోలీసులు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news