నేడే టీఆర్ఎస్ విసృత స్థాయి సమావేశం

-

ఇవాళ టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. తెలంగాణభవన్​లో మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అధ్యక్షతన శాసనసభ, పార్లమెంట్​పక్షం, పార్టీ కార్యవర్గం సంయుక్తంగా భేటీ కానుంది. ఈ సమావేశానికి హాజరు కావాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్యవర్గ సభ్యులకు సమాచారం పంపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో సిద్ధం చేసే.. ప్రధాన ఉద్దేశంతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలతో కలిసి సమన్వయంగా పనిచేసేలా నియోజవకవర్గానికి ఒక ఇంఛార్జ్​ను నియమించనున్నట్లు తెలుస్తోంది. మునుగోడు ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న పలు పరిణామాలపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంపై ప్రధాని మోదీ నుంచి, బీజేపీ రాష్ట్ర నాయకులు పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తున్న నేపథ్యంలో.. ఎలా తిప్పికొట్టాలనే విషయలపై పార్టీ యంత్రాంగానికి కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.

ఎమ్మెల్యేలకు ప్రలోభాలు వెలుగు చూసినందున.. ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక అంశాలను ప్రస్తావించే అవకాశం ఉందని తెలుస్తోంది. సిట్టింగ్​లకు మళ్లీ అవకాశం ఇస్తామని గతంలోనే పలు సందర్భాల్లో చెప్పిన కేసీఆర్.. మరోసారి భరోసా ఇవ్వనున్నట్లు సమాచారం. కేసీఆర్ జిల్లాల పర్యటనలపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ఆవిర్భావ ప్రక్రియ పూర్తికాగానే జాతీయ స్థాయిలో పార్టీ నిర్మాణం, కార్యచరణపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది

Read more RELATED
Recommended to you

Latest news