రాజగోపాల్ రెడ్డి పై ఈసీకి ఫిర్యాదు చేసిన టిఆర్ఎస్

-

మునుగోడు బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై ఈసీకి ఫిర్యాదు చేశారు టిఆర్ఎస్ నేతలు. రూ. 18 కోట్ల కాంట్రాక్టు తీసుకొని రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరారని టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే ఆయనని అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టులు ఇస్తే పార్టీలో చేరుతామని క్విడ్ ప్రోకో ఒప్పందాలు చేసుకున్నారని టిఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఆరోపించారు.

అయితే దీన్ని రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఏది నిజమో, ఏది అబద్దమో తేల్చుకునే సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా కేటీఆర్ కు సవాల్ విసిరారు. తనపై చేసిన క్విడ్ ప్రోకో ఆరోపణలు నిజమని నిరూపించాలని.. లేకపోతే పరుగు నష్టం దావా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. తనపై చేసిన ఆరోపణలను 24 గంటల సమయంలో నిరూపించాలని.. లేనిపక్షాన పరువు నష్టం దావా కు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news