బ్రేకింగ్ : కరోనాతో టీఆర్ఎస్ నేత మృతి

-

తెలంగాణా కరోనా కల్లోలం సృష్టిస్తోంది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కాస్త తక్కువగానే కనిపిస్తోన్నా జనాల్లో టెన్షన్ మాత్రం పోవడం లేదు. ఇప్పటికే కరోనాతో ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేని కోల్పోయిన టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మరో కీలక నేతాను కోల్పోయింది. ఆదిలాబాద్ జడ్పి వైస్ చైర్మన్ ఆరె రాజన్న కరోనాతో చికిత్స పొందుతూ హైదరాబాదులోని ఒక ప్రైవేటు హాస్పిటల్ లో మృతి చెందారు.

rs

ఈయన ముందుగా చాందా టి సర్పంచ్ గా సేవలు అందించారు. తర్వాత ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా పని చేశారు. ప్రస్తుతం జడ్పీ వైస్ చైర్మన్ గా రాజన్న కొనసాగుతున్నారు. ఇక ఈయన మృతి చెందిన విషయం తెలుసుకుని పలువురు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక జడ్పీ వైస్ చైర్మన్ ఆరె రాజన్న మృతి పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి క‌ల‌గాల‌ని, ఆ భ‌గ‌వంతుడు వారి కుటుంబ స‌భ్యుల‌కు మ‌నోధైర్యాన్ని ప్రసాదించాల‌ని ప్రార్థించారు.

Read more RELATED
Recommended to you

Latest news