బిగ్ బ్రేకింగ్ : ఎమ్మెల్యే కిషన్ రెడ్డికి కరోనా..!

-

తెలంగాణలో కరోనా వ్యాప్తి రోజురోజుకి పెరిగిపోతోంది. తాజాగా ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది. దీంతో ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అయితే కిషన్ రెడ్డి కుటుంబ సభ్యులకు కూడా కరోనా టెస్టులు నిర్వహించారు. వారి రిపోర్టు రావాల్సి ఉంది. ఇటీవల ఎమ్మెల్యేను కలిసిన వారి వివరాలను అధికారులు ఆరాతీస్తున్నారు. తెలంగాణలో కరోనా బారిన పడుతున్న రాజకీయ నేతల సంఖ్య పెరుగుతోంది.

అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన హోంమంత్రి మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, గణేష్ గుప్తా కరోనా బారినపడ్డారు. ఇక కాంగ్రెస్ నేతలు వి.హనుమంతరావు, గూడూరు నారాయణరెడ్డి, బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డికి సైతం కరోనా సోకిన విషయం తెలిసిందే. ఐతే వీరిలో చాలా మంది ఇప్పటికే కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news