ఊపిరి ఉన్నంత వరకు టిఆర్ఎస్ లోనే : టి .రాజయ్య క్లారిటీ

-

పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై ఎమ్మెల్యే ,మాజీ ఉప ముఖ్యమంత్రి టి .రాజయ్య స్పందించారు. తన జీవితాంతం టీఆరెస్ పార్టీలోనే ఉంటానని.. టీఆరెస్ లో కేసీఆర్ తనకు మంచి ప్రాధాన్యత ఇచ్చారని స్పష్టం చేశారు. నాకు ఇష్టమైన వైద్య ఆరోగ్య శాఖను, డిప్యూటీ సీఎం హోదా కేసీఆర్ నాకు కల్పించారని గుర్తు చేసుకున్నారు. నేను డిప్యూటీ సీఎం అయిందే ముఖ్యమంత్రి కేసీఆర్ వల్ల అని.. నా చివరి ఊపిరి ఉన్నంత వరకు టీఆరెస్ పార్టీలోనే ఉంటానని తెలిపారు.

షర్మిలను నేను కలవలేదు- అలాంటి అవసరం రాలేదన్నారు.సోషల్ మీడియా- మీడియాలో నాపై తప్పుడు ప్రచారం చేశారని.. లోటస్ పాండ్ దగ్గర అనిల్ కుమార్ ను నేను కలిసినట్లు అసత్య ప్రచారం చేశారని మండిపడ్డారు. గతంలో ఓ క్రైస్తవ సమావేశం సందర్భంగా కలిసిన ఫోటోను వైరల్ చేశారని.. వైఎస్సార్ పై నాకు అభిమానం ఉన్నది వాస్తవమేనని పేర్కొన్నారు. వైఎస్ నాకు టికెట్ ఇచ్చి రాజకీయంగా ప్రోత్సహించారని.. జగన్మోహన్ రెడ్డి తో కూడా నా సావాసం గతంలో ఉండేదన్నారు. సోనియాగాంధీ ప్రవర్తన వల్ల తెలంగాణ కోసం జగన్మోహన్ రెడ్డి ని పక్కనబెట్టి బయటకు వచ్చానని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డినా- తెలంగాణనా అంటే.. తెలంగాణనే అని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసానని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news